హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యామండలి సంయుక్త కార్యదర్శిగా (జేఎస్) శ్రీనివాస్ నియమితులయ్యారు. గతంలో ఆయన అడ్మిన్ విభాగం డిప్యూటీ సెక్రటరీగా, అకడమిక్ విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. జేఎస్గా నియమిస్తూ ఇటీవలే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాస్ను సన్మానించారు.