సిటీబ్యూరో, మార్చి 13(నమస్తేతెలంగాణ): సొంతి ల్లు ఉండాలన్నది ప్రతిఒక్కరి కల. ఈ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో ఆరాటపడుతుంటాం. తమకు నచ్చిన బడ్జెట్లో ఇంటి కోసం ఎంతో వేట కొనసాగి స్తాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా నచ్చిన బడ్జెట్లో ఇల్లు లభించేలా టీ న్యూస్ ఆధ్వర్యంలో ప్రాపర్టీషో ప్రారంభించింది. మాదాపూర్ హైటెక్స్లో పలు రియల్ ఎస్టేట్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను శనివారం ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్రావు ప్రా రంభించారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో రియల్ రంగం పుంజుకుంటుందనేందుకు భారీగా తరలివచ్చిన సందర్శకులే నిదర్శనం. రెండో శనివారం సెలవు కావడంతో చాలా మంది కుటుంబ సభ్యులతో తరలివచ్చి తమ బడ్జెట్లో ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయోనని ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం దాకా ప్రాపర్టీ షో కొనసాగుతుందని, 70కి పైగా రియల్ఎస్టేట్ సంస్థలు స్టాళ్ల ను ఏర్పాటు చేసినట్టు టీన్యూస్ సీజీఎం ఉపేందర్ తెలిపారు.
భారీ ప్రాజెక్టుల స్టాళ్లు
ప్రాపర్టీ షోలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలైన అప ర్ణ, మైహోం, రాజపుష్ప, వాసవి, సుమధుర, ప్రగతి, వర్టెక్స్, ఆర్క్ గ్రూపు, ముప్పా, ఆదిత్య, ఇండిస్, శుభగృహ, వర్చుసా వంటి సంస్థలు తమ ప్రాజెక్టుల వివరాలతో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) తమ స్టాల్ను ప్రాపర్టీషోలో ఏర్పాటు చేసింది. అతి తక్కువ వడ్డీ రేటు 6.07శాతంతో గృహ రుణాలు తీసుకునే అవకాశం ఉందని, మార్చి నెలాఖరు వరకు ఎలాం టి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా, అత్యంత వేగంగా రుణా లు మంజూరు చేసేలా గృహ రుణాల విభాగం పనిచేస్తున్నదని ఎస్బీఐ ఏజీఎం ఉషారాణి తెలిపారు.
భారీగా తరలివచ్చిన సందర్శకులు
హైటెక్స్లోని టీన్యూస్ ప్రాపర్టీ షోకు తొలిరోజు భారీ గా సందర్శకులు తరలివచ్చారు. కరోనాతో కొన్ని నెలలుగా ప్రాపర్టీ షోలు లేకపోవడంతో మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి? ఎలాంటి ప్రాజెక్టులున్నాయో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో నగరానికి చెంది న బడా రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు చిన్న, మధ్యస్థాయి రియల్ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి.