ఫేస్బుక్లో యువతిగా పరిచయమై, ఆ తరువాత అసభ్య వీడియో చాటింగ్తో ట్రాప్ చేసి తనను సైబర్నేరగాళ్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ పంజాగుట్టకు చెందిన ఓ విద్యార్థి సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంజాగుట్టకు చెందిన ఓ విద్యార్థికి ఫేస్బుక్లో, ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడంతో ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాడు. తరువాత ఆ యువతి, విద్యార్థితో ఫెస్బుక్ మేసింజర్లో చాటింగ్ చేసి ఫోన్ నంబర్లు మార్చుకుని చాటింగ్ వ్యవహారం వాట్సాప్కు మార్చారు. ఈ క్రమంలోనే యువతి యువకుడితో అసభ్య చాటింగ్ చేస్తూ, యాప్ల సహాయంతో అర్ధనగ్న, నగ్నంగా ఉన్న వీడియోలను చూపిస్తూ యువకుడిని రెచ్చగొట్టింది. అది నిజమని నమ్మిన యువకుడు తాను కూడా అలాగే వీడియోలో చాటింగ్ చేశాడు. యువకుడు చాటింగ్ చేసిన వీడియోలను రికార్డు చేసిన సైబర్నేరగాళ్లు అనంతరం బ్లాక్మెయిలింగ్కు దిగారు. ఆ వీడియోలను యూట్యూబ్లో పెట్టి, ఆ లింక్లను యువకుడికి పంపించడంతో ఖంగారుపడుతూ వాటిని వెంటనే తొలగించాలంటూ బతిమాలాడు. తమకు రూ.51 వేలు పంపిస్తే, వాటిని తొలగిస్తామంటూ బ్లాక్మెయిలింగ్ మొదలు పెట్టడంతో చివరకు రూ. 25 వేలు ఇస్తానంటూ యువకుడు ఒప్పుకొని ఆ డబ్బును సైబర్నేరగాళ్లకు పంపించాడు. తరువాత తిరిగి సైబర్నేరగాళ్లు డబ్బు కావాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో బాధితుడు తనను సైబర్నేరగాళ్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.