కీసర, జూన్ 30 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో నాబార్డ్ నిధులు రూ.1.50 కోట్లతో నూతన గిడ్డంగి(గోదాం) పనులకు గురువారం మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నదని, రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
రైతులు పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతి మండలంలో కొత్తగా గిడ్డంగిలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నదన్నారు.
రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిడ్డంగిలో పెడుతున్నదని , పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, సర్పంచులు మాధురి వెంకటేశ్, ధర్మేందర్, విమలానాగరాజు,గోపాల్రెడ్డి,ఎంపీటీసీలు నారాయణశర్మ, కవితాశశికాంత్,మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, నేతలు ఆర్.శ్రావన్కుమార్గుప్త, ఎం.జగయ్యయాదవ్, రమేశ్యాదవ్, నారాయణ, శ్రీనివాస్, సహకార సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.
నాటా మహాసభలకు మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ రూరల్, జూన్ 30 : అమెరికాలోని వాషింగ్టన్లో జరిగే నార్త్ అమెరికా తెలుగు (నాటా) మహాసభలలో పాల్గొనేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం బలుదేరి వెళ్లారు. ఆయన జూలై 13వ తేదీ వరకు అమెరికాలో ఉంటారు.