నేరేడ్మెట్, : విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో రవీంద్రభారతి పాఠశాలను మండల విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. పాఠశాల నిర్వాహకులు విజయలక్ష్మి రెడ్డి, విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి, ఈస్ట్ కాకతీయనగర్లోని రవీంద్రభారతి పాఠశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని వేధింపులకు పాల్పడటంతో గురువారం 10వ తరగతి విద్యార్థిని యశస్విని (16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. శుక్రవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ, సీపీఎం, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసి.. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని , పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థిని మృతదేహంతో స్కూల్ ఎదుట ఆం దోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎంఈవో శశిధర్ అక్కడికి వచ్చి… స్కూల్ను సీజ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి.. బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థిని కుటుంబా