వెంగళరావునగర్, ఆగస్టు 17 : ట్యూషన్కు వచ్చిన బాలుడిని బెత్తంతో తీవ్రంగా గాయపరచిన టీచర్పై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..కరోన కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో బాపూనగర్ కు చెందిన ఎస్.రిమ్షానా తన కుమారుడు తనిష్(8)ను వెంగళరావునగర్ లోని విజయలక్ష్మి అనే మహిళ ఇంటికి ట్యాషన్కు పంపిస్తోంది.
ప్రతిరోజు సాయంత్రం ట్యాషన్కు వెళ్లివస్తునన తనిష్ ప్రవర్తనలో మార్పును గమనించింది, ట్యాషన్కు వెళ్లేందుకు బాలుడు భయపడుతుండడంతో తల్లి నిలదీసింది. తనిష్ తన ఎడమ చేతి పై అయిన గాయాలను తల్లికి చూపాడు. ఒళ్లంతా కూడా బెత్తంతో కొట్టడంతో కందిపోయిన గాయాలున్నాయి.
హోంవర్క్ చేయడం లేదని ట్యాషన్ టీచర్ తనను రోజు కొడుతున్నట్లు తనిష్ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీచర్ పై 323, 75 జె.జె యాక్ట్ ప్రకారం..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.