చిక్కడపల్లి, జూన్ 9: నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. బుధవారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలోని బృందావన్ కాలనీలో రూ. 14 లక్షలతో వీడీసీసీ రోడ్డు పనులు, ఆర్టీసీ కల్యాణ మండపం వద్ద రూ.4.7 లక్షలతో ఫుట్పాత్ పనులను స్థానిక కార్పొరేటర్ రవిచారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్లో వీడీసీసీ రోడ్డు పనులతో పాటు వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహ, ఏఈ మురళీ, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వివేక్, ఆర్.మోజస్, ముచ్చకుర్తి ప్రభాకర్, డివిజన్ ఉపాధ్యక్షుడు శివకుమార్ యాదవ్, ఆర్. జయదేవ్, కూరగాయల శ్రీనివాస్, కల్యాణ్ నాయక్, జనార్దన్, పాశం శ్రీనివాస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కవాడిగూడ: పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. భోలక్పూర్ డివిజన్లోని మహాత్మానగర్లో తాగునీటి నల్లా కనెక్షన్ ఇప్పించాలని స్థానికులు చేసిన విజ్ఞప్తి మేరకు బుధవారం జలమండలి డీజీఎం చంద్రశేఖర్, సెక్షన్ మేనేజర్ ప్రసాద్ బాబులతో కలిసి నల్లా కనెక్షన్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. తమ బస్తీలో 21 ఇండ్లకు నల్లా కనెక్షన్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి బస్తీవాసులు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి కనెక్షన్లు ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, వై.శ్రీనివాస్రావు, లక్ష్మీగణపతి ఆలయ చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, భవానీ శంక ర్ ఆలయ చైర్మన్ ఆర్.శ్రీనివాస్, నాయకులు మహ్మద్ షరీపోద్దీన్, శంకర్గౌడ్, వాహబ్, శ్రీధర్రెడ్డి, సాయి, శ్రావణ్, బస్తీ వాసులు నందు, బిజ్జి కనకేశ్ కుమార్, బాలచందర్, శివ, రాములు తదితరులు పాల్గొన్నారు.