ఆస్పత్రి అభివృద్ధిపై హెచ్డీఎస్ సమావేశం
హాస్పిటల్లో పర్యటించిన కలెక్టర్ శ్వేతా మహంతి
బన్సీలాల్పేట్, మార్చి 13: సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి అభివృద్ధి, రోగులకు మరిం త మెరుగైన సేవలందించే అంశాలు, సామగ్రి మరమ్మతులకు చేపట్టవలసిన చర్యలపై హైద్రాబాద్ జిల్లా కలెక్టర్, హెచ్డీఎస్ చైర్మన్ శ్వేతా మహంతి చర్చించారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (హెచ్డీఎస్) సమావేశం శనివారం కాన్ఫరెన్స్ హాల్లో సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుతో పాటు టీఎస్ఎంఐడీసీ, పరిపాలనా విభాగం అధికారులు, పలు విభాగాల హెచ్ఓడీలతో ఆమె మాట్లాడారు. హాస్పిటల్ అభివృద్ధి కోసం పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై చర్చించి, కొన్నింటికి అనుమతులను మంజూరు చేశారు. అనంతరం, హాస్పిటల్లో పర్యటించి, అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఇకపై తాను రెగ్యులర్గా హాస్పిటల్కు వచ్చి పర్యవేక్షిస్తానని ఆమె తెలిపారు. సమావేశంలో ముషీరాబాద్ తహసీల్దార్ జానకి, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ జి.నర్సింహారావు నేత, డా॥ ఏ.శోభన్బాబు, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా॥ జి.ప్రకాశ్రావు, హెచ్ఓడీలు డా॥ వినయ్శేఖర్, డా॥ కృష్ణమోహన్, డా॥ శ్రావణ్ కుమార్, ఆర్ఎంఓ డా॥ నరేంద్ర కుమార్, అడ్మిన్ ఏడీ నరేందర్, టీఎస్ఎంఐడీసీ ఈఈ సారంగపాణి, అలూమ్ని అసోసియేషన్ ప్రతినిధి డా॥ లింగమూర్తి, లయన్స్ క్లబ్ ప్రతినిథి విద్యాసాగర్ రెడ్డి, జనహిత సేవా ట్రస్ట్ కార్యదర్శి నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.