హిమాయత్నగర్,ఆగస్టు25: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 31వ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హిమాయత్నగర్ డివిజన్లో గణేశ్ ఉత్సవ సందడి మొదలైంది.గణనాథులు కొలువు దీరేందుకు ఇప్పటి నుంచే మండపాలను ఏర్పాటు చేసే పనిలో ఉత్సవ కమిటీలు నిమగ్న మయ్యాయి. మైత్రి,మండపాల నిర్వాహకులతో నారాయణగూడ పోలీసులు సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రతలపై పోలీసులు వివరిస్తున్నారు.పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.పీఎస్ పరిధిలోని మండపాల నిర్వాహకులతో ప్రతి రోజూ మాట్లాడి ఏ చిన్న సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్రెడ్డి సెక్టారు ఎస్సైలకు సూచించారు. మండపాల ఏర్పాటు కోసం ఆన్లైన్లో దర ఖాస్తులను చేసుకునే ప్రక్రియమొదలు కావడంతో మండపాల స్థలాలను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేని వాటికి అమమతిని ఇస్తూ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.వినాయక విగ్రహాలను నెలకొల్పేందుకు అవసరమైన అనుమతులు తీసుకున్న నిర్వాహకులు బస్తీ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు,యువజన సంఘాల నాయకులు సమావేశమై విగ్రహాలను కోనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా మండపాల వద్ద తాత్కలిక సీ,సీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.
శాంతి యుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి
కాలుష్య రహిత వినాయక విగ్రహాలనే ఏర్పాటు చేసి శాంతియుతంగా ఈ ఉత్సహాలు జరిగేందుకు నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలి.మండపాల వద్ద ఎలాంటి అభ్యతకరమైన పాటలు,ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను రాత్రి 10 గంటల వరకు మాత్రమే పెట్టు కోవాలి. మండపాల వద్ద రాత్రి సమయంలో తప్పని సరిగా నిర్వాహకులు అందుబాటులో ఉండాలి.మండపాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతితో పాటు ఐడీ నంబర్లను కేటాయిస్తాం.
-నారాయణగూడ పీఎస్ ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్రెడ్డి