చర్లపల్లి/మల్లాపూర్, నవంబర్ 28 : బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కాప్రా సర్కల్, సైనిక్పురి చౌరస్తాలోని తిరుపతయ్య సేవా ఆర్గనైజేషన్ నిర్వాహకులు యాట భాస్కర్ ముదిరాజ్, పెంచాల సురేందర్రావు, మల్లేశ్ వంశరాజ్, ఉదారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన కార్పొరేటర్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళు లర్పించారు. అనంతరం సంఘ సేవకుడు మిట్టపల్లి విజయ్గౌడ్ ఆధ్వర్యంలో (దాత) సుమారు వంద మంది వికలాంగులు, వయో వద్ధులకు, యాచకులకు బ్లాంకెట్లను ఎమ్మెల్యే అందజేశారు. కార్య క్రమంలో కార్పొరేటర్లు స్వర్ణరాజ్, సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్రెడ్డి, బొంతు శ్రీదేవి, జె.ప్రభుదాస్, పన్నాల దేవేందర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య, గుండారపు శ్రీనివాస్రెడ్డి, ధన్పాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్రెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, బద్రుద్దీన్, పాండుగౌడ్, నర్సింహ, సింగం రాజు, ఇతర నాయకులు సోమశే ఖర్రెడ్డి, సీతారాంరెడ్డి, వీకే మహేశ్, రవియాదవ్, రూపారెడ్డి, మర్రి మోహన్రెడ్డి, రమేశ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, నవంబర్ 28 : మల్లాపూర్ వార్డు కార్యాలయంలో ఆదివారం మహాత్మాజ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, తదితరులు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.