మలక్పేట, ఫిబ్రవరి 12 : జల్సాలకు అలవాటుపడి అప్పులపాలై.. ఆ అప్పులను తీర్చుకునేందుకు భారీ దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడిని, అతడికి సహకరించిన ప్రియురాలిని మలక్పేట పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 13 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్, ఈస్ట్జోన్ డీసీపీ రమేశ్ వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం, పంది ల్ల గ్రామానికి చెందిన తాండ్ర రాజేశ్ పాత నేరస్తుడు. ప్రస్తుతం మూసారాంబాగ్, శాలివాహననగర్లో నివాసముంటున్నాడు. అలాగే..యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం, సడువల్లి గ్రామానికి చెందిన యువతి కుటుంబం మలక్పేట ఆంధ్రాబ్యాంక్ కాలనీలోని పద్మావతి(74) ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.. భర్త చనిపోవడంతో పద్మావతి ఒంటరిగా ఉంటుంది..