రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతమవుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైళ్ల లో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు.అన్ని రైళ్లలో ప్రయాణికులంతా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు.రైళ్లలో సీటింగ్ విధానం కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు.రైలు ప్ర యాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించే వి ధంగా చర్యలు తీసుకుంటున్నారు.అలాగే, అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు గుంపులు గుంపులుగా తిరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పైగా వారికి అవగాహన కల్పిస్తున్నారు.రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా క్యూ పద్ధతిని పాటించే విధంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చ ర్యలు తీసుకున్నారు.రైళ్లలో గాని, స్టేషన్లలో గాని, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.ఆ ప్రాంతాలన్ని ప్రతి రోజూ శానిటైజ్ చేస్తున్నారు.రైల్వే స్టేషన్లకు చేరుకునే ప్రయాణికులు గాని, ఇతర వ్యక్తు లు ఎవ్వరైనా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడాన్ని నిషేధించారు.ఉమ్మేసిన వారిపై రూ.500 జరిమానా విధిస్తున్నారు. మాస్కులు ధరించని వారిపైనా జరిమానాలు విధిస్తున్నట్ల ప్రకటించారు.అందులో భాగంగా ఎస్సీఆర్ ఆధ్వర్యంలో రైల్వే సిబ్బంది సౌకర్యం సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు.కొనసాగింపుగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులతో పాటు తోడుగా వచ్చే వారి రద్దీని తగ్గించడంపైనా రైల్వే చర్యలు తీసుకుంది.ప్లాట్ఫామ్ టిక్కెట్ ధరను రూ.50 పెంచింది.