గోల్నాక, మార్చి 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చూసి పట్టభద్రులు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. ఆదివారం బాగ్అంబర్పేట డివిజన్ పోచమ్మబస్తీలో ఏర్పాటు చేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిరెడ్డి, డివిజన్ ఎన్నికల ఇన్చార్జి సందీప్రెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక మహిళా అభ్యర్థి సురభి వాణీదేవి అని అన్నారు. బీజేపీ నాయకులకు ఎందుకు ఓటెయ్యాలని, రోజు రోజుకూ పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతున్నందుకా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని ఆయన కోరారు.
ఈ నెల 14న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. ఆదివారం అంబర్పేట డివిజన్ బాపునగర్లో స్థానిక కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాచిగూడ,మార్చి 7: ప్రజా సంక్షేమం కోసం పాటుపడే టీఆర్ఎస్ పార్టీకే పట్టభద్రులు పట్టం కట్టాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బద్దుల ఓంప్రకాశ్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై లింగంపల్లి, బర్కత్పుర తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. దిడ్డి రాంబాబు, ఓంప్రకాశ్యాదవ్, డాక్టర్ శిరీషాయాదవ్, రవీందర్యాదవ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా టీఆర్ఎస్ నాయకుడు పట్లూరి సతీశ్ ఆధ్వర్యంలో ఆదివారం నింబోలిఅడ్డా, బండల్బస్తీ, తదిర ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర భీష్మా, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.