న్యూఢిల్లీ : బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో మదుపు చేసే భారత మగువల్లో అత్యధికులు ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల వారే అదికమని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ కాయిన్డీసీఎక్స్ వెల్లడించింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఇన్వెస్టర్లు డిజిటల్ కరెన్సీల పట్ల ఆసక్తికనబరుస్తున్నారని తమ అంతర్గత అథ్యయనంలో తేలిందని ఆ సంస్ధ పేర్కొంది. 2020లో తమ ఇన్వెస్టర్లలో 15 శాతం మంది మహిళలున్నారని 2021లో మహిళా మదుపరుల సంఖ్య 20 శాతం పైగా ఉందని తెలిపింది.
నవంబర్-డిసెంబర్ వ్యవధితో పోలిస్తే మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య మూడు రెట్లు ఎగబాకిందని కాయిన్డీసీఎక్స్ వెల్లడించింది. ఇక తమ మహిళా మదపరుల్లో 60 శాతం మంది 18-34 ఏండ్ల వయస్కులని పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మహిళా ఇన్వెస్టర్లలో 15 శాతం మంది పైగా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేశారని, మరికొందరు ఇతీరమ్, తెతర్, రిపిల్ (ఎక్స్ఆర్పీ), కర్డనోలో మదుపు చేశారని తెలిపింది.