న్యూఢిల్లీ: మిస్ ఇండియా ఢిల్లీ-2019 కిరీటం దక్కించుకున్న అందగత్తె మాన్సీ సెహగల్ ఈ ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీలో (ఆప్లో) చేరారు. ఆప్ నేత రాఘవ్ చద్దా సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. అనంతరం రాఘవ్ చద్దా మట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరు, ఢిల్లీ కేజ్రివాల్ సర్కారు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలై మాన్సీ సెహగల్ తమ పార్టీలో చేరారని చెప్పారు. మాన్సీ సెహగల్ ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివారు.