కిలోపై రూ.1,200 పెరిగిన ధర
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతోపాటు దేశీయంగా కొనుగోళ్ళు ఊపందుకోవడం ధరలు అధికమవడానికి దోహదపడ్డాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.46,370 పలికింది. అంతకుముందు ధర రూ.46 వేలుగా ఉన్నది. కిలో వెండి ఏకంగా రూ.1,150 ఎగబాకి రూ.69,660 వద్దకు చేరుకున్నది. హైదరాబాద్లో బంగారం మరో రూ.650 అందుకొని రూ.47,850 పలికింది. అలాగే వెండి మరో రూ.1,300 ఎగబాకి రూ.75,700కి చేరుకున్నది.