చెన్నై : చెన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగే రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిటెస్ట్లో 227 పరుగులతో ఓటమిపాలైన టీమిండియా నాలుగు టెస్టుల సిరిస్లో 0-1 వెనుకపడింది. ఈ మ్యాచ్లో భారత్ మార్పులు చేసింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ టెస్టుల్లో అరంగ్రేటం చేస్తున్నాడు. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ను, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్పటేల్, షాబాజ్ నదీమ్ స్థానంలో కుల్దీప్కు అవకాశం ఇచ్చారు. సుమారు రెండేళ్ల విరామం అనంతరం టెస్టుల్లోకి కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే ఇంగ్లాండ్ సైతం నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. అండర్సన్, బట్లర్, ఆర్చర్, బెస్కు విశ్రాంతి ఇవ్వగా.. బ్రాడ్, ఫోక్స్, స్టోన్, మొయిల్ అలీని తుదిజట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్లో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతి ఇచ్చారు. తొలిటెస్టుకు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించగా.. రెండో టెస్టుకు 50శాతం మంది వీక్షకులకు అవకాశం ఇచ్చారు.
భారత్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, చేటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (సి), అజింక్య రహానె, రిషబ్ పంత్ (డబ్ల్యూ), ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ జట్టు : డోమ్ సిబ్లీ, రోరే బర్న్స్, డాన్ లారెన్స్, జో రూట్ (సి), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్, మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, ఆలీ స్టోన్.