కంటోన్మెంట్, జూన్ 19: విపత్కర పరిస్థితుల్లో సాటివారికి అండగా ఉండాలనే సంకల్పం రావ డం శుభపరిణామమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం న్యూబోయిన్పల్లిలోని మర్రి రాజశేఖర్రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద బజాజ్ ఆటో లిమిటెడ్ స్పాన్సర్షిప్తో సీఎంఆర్ ఆటోమొబైల్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు 5 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను వారు పంపిణీ చేశారు. కరోనాతో కష్టకాలంలో సుమారు 250 మంది ఆటోడ్రైవర్లను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, సీఎంఆర్ ఆటోమొబైల్ ఎండీ బొర్ర అభినవ్రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నళినికిరణ్, పాండుయాదవ్, లోక్నాథంతో పాటు ఆటో యూనియన్ అధ్యక్షుడు మారయ్య, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ప్రభాకర్తో సహా ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.