సూర్యాపేట, మార్చి30 : ఉద్యోగులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి సంఘం ఆధ్వర్యంలో ముందుకు సాగాలని టీఎన్జీఓ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. టీఎన్జీఓ డైరీ, క్యాలెండర్ను మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర, జిల్లా కమిటీలు వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేలా పోరాడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని వెల్నెస్ కేంద్రాల్లో అదనపు ఏర్పాట్ల కోసం ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కృషి
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఉద్యోగుల పాత్ర కీలకమైన దన్నారు. జిల్లాలోని ఉద్యోగులకు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జానీమియా, కార్యదర్శి దున్న శ్యాం, రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్, నాయకులు పాల్గొన్నారు.