కరోనా వైరస్ రావడంతో ప్రతి ఒక్కరికీ చేతులు, కాళ్లను సబ్బు, ఇతర క్రీములతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటైంది. ఈ అలవాటు వంటింటికి కూడా చేరింది. అంటే, నిత్యం వంట కోసం తీసుకొచ్చే కూరగాయలతోపాటు పండ్లను కూడా చాలా మంది సబ్బుతో క్లీన్ చేస్తున్నారు. కరోనా వంటి వైరస్లు, ఇతర సూక్ష్మక్రిములను దూరం చేసుకునేందుకు చాలా మంది రకరకాలుగా పండ్లు, కాయగూరలను శుభ్రం (Vegetables cleaning) చేసుకుంటున్నారు. అయితే, పండ్లు, కూరగాయలను ఎలా శుభ్రం చేయాలి..? దేనితో శుభ్రం చేయాలి..? అనే అవగాహన లేదు. ఫలితంగా ఆరోగ్యం మాటేమో గానీ.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
వంటలు చేయడానికి ముందు మనం కూరగాయలను శుభ్రం చేసుకుంటుంటాం. చాలా మంది ఇంట్లో వాడే సబ్బులతోనే వాటిని కూడా పరిశుభ్రం చేసుకుంటున్నారు. మరికొంతమంది సర్ఫ్లను కూడా వాడుతున్నారు. కూరగాయలు, పండ్లను సబ్బు, డిటర్జెంట్లు, సర్ఫ్, డెటాల్, శానిటైజర్లు, ఇతరాత్ర క్లీనింగ్ వస్తువులతో శుభ్రం చేయాలనేది కేవలం అపోహ మాత్రమేనని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) వెల్లడించింది. ఇలా క్లీన్ చేయడం వల్ల వాటిని తిన్నప్పుడు మన పొట్టలోకి పోయి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని ఎఫ్డీఏ హెచ్చరించింది. పండ్లు, కూరగాయలను సబ్బు, డిటర్జెంట్లతో శుభ్రం చేసినప్పుడు వాటి తొక్కపై కొంత మిగిలిపోతుందని, వాటిని తిన్నప్పుడు మన పొట్టలోకి వెళ్తాయని ఎఫ్డీఏ తెలిపింది. ఇలాంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు వస్తాయి. వాంతులు, విరేచనాలతోపాటు డయోరియాకు దారితీసే ప్రమాదమున్నది. అదేవిధంగా, గట్లో కూడా సమస్యలు సృష్టించొచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను తెచ్చిన వెంటనే కుళాయి కింద పెట్టి మెల్లగా నీరు పోస్తూ కడగాలి. ఫలితంగా వీటిని పట్టుకుని ఉండే దుమ్ము, బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతాయి. కుళాయిలో నీరు మరీ ఫోర్స్గా కాకుండా నెమ్మదిగా వదలాలి. ఎవైనా పగిలి ఉన్నట్లయితే వాటిని తీసేయడం లేదా పగిలి ఉన్న భాగాన్ని తొలగించి వాడుకోవడం చేయాలి. బంగాళదుంప, చిలగడదుంప, క్యారట్, అల్లం వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు బ్రష్ లేదా స్పాంజ్ వాడటం మంచిది. కూరగాయలను కడిగేప్పుడు పాత్రలో వేయకూడదు. బయట కుళాయిని వాడాలి. అలాగే, ఆకుకూరలను ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలి.
ఆకుకూరలను పెద్ద పాత్రలో వేసి నీరు, ఉప్పు వేసి కాసేపు ఉంచితే పురుగులు ఉంటే బయటకు వస్తాయి. ఆకుకూరలను టవల్లో ఉంచి నీరు వెళ్లేలా చేయగలిగితే ఫ్రెష్గా ఉంటాయి. అయితే, ప్రీ వాష్డ్, ప్రీ బ్యాగ్డ్ పదార్థాలను మరోసారి శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. అలా చేయడం కలుషితం ప్రమాదాన్ని పెంచుతుంది. చివరగా, కూరగాయలు, పండ్లను శుభ్రం చేసే ముందు, చేసిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం మాత్రం మరిచిపోవద్దు.
పండ్లు, కూరగాయాలను చల్లటి నీటితో శుభ్రం చేయడం చాలా మంచిదని సెలవిస్తున్నారు ఉత్తర కరోలినా స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బెన్ చాప్మ్యాన్. చల్లటి నీటి కింద కూరగాయాలను శుభ్రం చేయడం వల్ల ఇ.కొలై, సాల్మనెల్లా, లిస్టేరియా వంటి రోగకారకాలు 90 నుంచి 99 శాతం వరకు తొలిగిపోతాయని ఆయన చెప్పారు. దుస్తులను శుభ్రం చేయడానికి వినియోగించే సబ్బులను, డిటర్జెంట్లను కూరగాయలకు వాడితే మన పొట్టలోకి వెళ్లి జీర్ణసంబంధ సమస్యలు తెస్తాయని ఆయన హెచ్చరించారు.
ఇవి ఎకో ఫ్రెండ్లీ బూట్లు.. ఉత్పత్తి ఎక్కడో తెలుసా..?
నష్టాలు పెరుగుతున్నా.. వేగం పుంజుకుంటున్న జోమాటో
ఆఫ్ఘాన్లో దిగజారిన పరిస్థితి : ఇండియా తిరిగొచ్చిన 50 మంది
డయాబెటిస్ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
ఇస్రో మరో మైలురాయి.. ఆకాశంలో మన ‘కన్ను’
చిన్నారిని చంపేసిన ఆన్లైన్ చదువు
చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..