కవాడిగూడ, మే 25: అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని మల్లన్న దేవాలయం నుంచి ఇందిరానగర్ ప్రధాన రహదారిలో రూ. 34 లక్షల వ్యవయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, జలమండలి డీజీఎం చంద్రశేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. భోలక్పూర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, స్థానికులు డ్రైనేజీ, వాటర్ పైపులైన్ నిర్మాణ పనులు ఉంటే ముందుగానే సంబంధిత అధికారుల అనుమతులు తీసుకొని పూర్తి చేసుకోవాలని ఆయన అన్నారు. కలుషిత నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రూ. 20 కోట్లతో డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ టీఆర్ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహ్మద్ అలీ, వై. శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు బింగి నవీన్కుమార్, జునేద్ బాగ్థాది, మున్వర్ చాంద్, భవానీ శంకర్ దేవాలయం చైర్మన్ ఆర్. శ్రీనివాస్, నాయకులు శంకర్ గౌడ్, వాహబ్, జబ్బార్, ఆరీపోద్దీన్, శ్రావణ్, ముజాహిద్, హాజీపాషా, కళ్యాణ్, వాటర్ వర్క్స్ డీజీఎం చంద్రశేఖర్, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, వర్క్ ఇన్స్పెక్టర్ నాగేశ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.