మెదక్/పాపన్నపేట : భక్తుల కోరిన కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతున్న ఏడుపాయల వనదుర్గాభవానీ మాత ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
క్యూలైన్లో భక్తులు పెద్ద సంష్యలో నిల్చోని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా కరోనా నిబంధనలు పాటించేలా ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
పెద్దపల్లి జిల్లాలో..కరోనాతో అటెండర్ మృతి
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత