గజ్వేల్: రైతులకు మేలు చేసేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దళారుల ప్రమేయం లేకుండా శనగలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులు తమ సరుకులను నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకుని అమ్మకానికి తీసుకురావాలని సూచించారు. తేమశాతం 14 లోపు ఉన్న శనగలను మార్కెట్కు తీసుకురావాలన్నారు. రైతులకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.