స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నటిస్తున్న చిత్రం ‘రైతన్న’. తొలికాపీ సిద్ధమైంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నేడు భారతదేశంలో రైతులు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. దేశానికి వెన్నుముక అయిన అన్నదాత దయనీయమైన స్థితిలో ఉన్నాడు. మార్కెట్లో గిట్టుబాటు ధరలేక, అప్పులు తీర్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు. అన్నంపెట్టే రైతన్న బ్రతకాలి. ఈ విశ్వాన్ని, సకల జీవరాశిని బ్రతికించాలి. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసినప్పుడే రైతు రాజుగా మారతాడు. వ్యవసాయం దండుగ కాదు..పండగ అనే రోజు రావాలి. ఇలాంటి అంశాల్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాను’ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా