లక్నో : ఉత్తర్ప్రదేశ్లో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు గణనీయంగా తగ్గడం, మరణాల సంఖ్య చాలా రోజులుగా జీరోగా నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కొవిడ్-కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి కోసం మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్-19 నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది.