డయాబెటీస్.. ప్రస్తుతం దేశంలో ఎక్కువ మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. ఒకసారి మన రక్తంలో చక్కెర (Blood Sugar) కనిపించిందంటే.. దానిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకని షుగర్ను కంట్రోల్లో పెట్టుకోవడం ఒక్కటే మార్గం. ఇందుకోసం మనం నిత్యం తీసుకునే ఆహారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారాల ద్వారానే రక్తంలో చక్కరలు పెరుగుతుంటాయి.
అందుకని, రక్తంలో చక్కెరలను పెంచే ఆహారాలను దూరం పెడుతూ, చక్కెరలను అదుపులో ఉంచే ఆహారాలను తీసుకోవడం, మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. అందుకు ముందుగా ఏవి తినాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. నిత్యం తీసుకునే ఆహారాల్లో పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవడం ద్వారా షుగర్ను కంట్రోల్లో పెట్టుకోవచ్చు.
డయాబెటీస్తో బాధపడుతున్న వారు ముఖ్యంగా తమ ప్లేట్లో ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, ఫంగ్రీక్, బతువా, బ్రకోలి, పొట్లకాయ, సోరకాయ వంటివి మధ్యాహ్న భోజనంలోకి తీసుకోవాలి. వీటిలో తక్కువ క్యాలరీ, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయల్లో లభించే యాంటీ-ఆక్సిడెంట్ పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అదేవిధంగా గుండె ఆరోగ్యానికి, కండ్లకు చాలా మంచివి. టైప్-2 డయాబెటిస్ రోగులకు ఉపయోగపడే విటమిన్-సీ కూడా గ్రీన్ వెజిటేబుల్స్లో లభిస్తుంది. రక్తపోటు ఎవరిలోనైతే నియంత్రణలో ఉంటుందో వారిలో రోగనిరోధక శక్తి బలపడుతుంది.
మధుమేహం సమస్యతో బాధపడుతున్నవారు తినే ధాన్యాలను కూడా మార్చాల్సి ఉంటుంది. భోజనంలోకి ఎక్కువగా పప్పులను చేర్చడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. పప్పులు శరీరానికి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలను అందిస్తాయి. గోధుమలతో చేసిన బ్రెడ్కు బదులుగా ధాన్యపు రొట్టె, ఊక లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బార్లీ, క్వినోవాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.
ఆరోగ్యంగా ఉండేందుకు కోడిగుడ్లు తినడం చాలా మంచిది. నిత్యం కోడిగుడ్డును తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. కోడిగుడ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు లెక్కలేనంత ప్రోటీన్తో పాటు అమైనో ఆమ్లాలు ఉంటాయి. కోడిగుడ్లను తినడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వాపులను తగ్గించడమే కాకుండా చక్కెరలను అదుపులో ఉంచుతుంది. నిత్యం కోడిగుడ్డు తినేవారిలో టైప్-2 డయాబెటీస్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
మధ్యాహ్న భోజనంలోకి పెరుగు తినడం ద్వారా సాధారణ మనుషులతోపాటు షుగర్ పేషెంట్లు రెట్టింపు శక్తిని పొందవచ్చు. యోగార్ట్ తినడం వల్ల కాల్షియం, ప్రోటీన్తోపాటు ఇతర పోషకాలు లభిస్తాయి. యోగార్ట్లో పాలిఅన్సాచురేటెడ్, ఒమేగా-6 వంటి కాంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లాలు ఆరోగ్యకరమైన చక్కెరలను పెంచుతాయి. ఈ కాంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లాలు శరీరం బరువు తగ్గించుకోవడంలో, వ్యాధి నిరోధకతను పెంచుకోవడంలో సహకరిస్తాయి.
మాంసాహారం తినే అలవాటు ఉన్నవారు చేపలను భోజనంలో ఆహారంతోపాటు తీసుకోవడం మంచి అలవాటు. ముఖ్యంగా సార్డైన్స్, హెర్రింగ్, సాల్మన్ చేపలను తినడం చాలా మంచిది. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతోపాటు డీహెచ్ఏ, ఏపీఏలు ఎక్కువగా లభిస్తాయి. చేపలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకని ఎక్కువ మొత్తంలో చేపలను ఆహారంగా తీసుకోవాలి.
కలోంజితో కరోనా ఇన్ఫెక్షన్కు చెక్..?!
విమానయాన రంగంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు
తల్లి పాలతో చిన్నారుల్లో ఆరోగ్యం
ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
చరిత్రలో ఈరోజు.. కశ్మీర్ స్వాధీనానికి పాక్ కుట్ర
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..