నాగర్ కర్నూల్ : నల్లమల అడవిలో వన్యప్రాణులను వేటాడుతున్న ఏపీకి చెందిన వేటగాళ్లను అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మద్దిమడుగు సమీపంలో కృష్ణానదీ తీరం వెంట వన్యప్రాణులను వేటాడుతున్న ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఆరుగురిలో ముగ్గురు పరారు కాగా..ముగ్గురిని అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
మద్దిమడుగు రేంజ్ పరిధిలో గీసుగండి అటవీ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకుని వీరు వేటాడిన రెండు చుక్కల దుప్పిల కళేబరాలను అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నదీతీరంలో చేపల వేటకు కృష్ణా నదీ దాటి వచ్చిన వీరంతా చేపల వేట ముసుగులో వన్యప్రాణులను వధిస్తున్నారని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
పరారీలో ఉన్న వారిని సైతం అదుపులోకి తీసుకుంటామన్నారు. అటవీ చట్టాల ప్రకారం వీరిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వన్యప్రాణుల జోలికి వస్తే ఊచలు లెక్కించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి…
ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన సేవలందించాలి