నర్సంపేట/వర్ధన్నపేట/పరకాల, ఏప్రిల్ 20: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల ఏసీపీలు ఫణీందర్, గొల్ల రమేశ్, శ్రీనివాస్ హెచ్చరించా రు. నర్సంపేట, పరకాల డివిజన్లలోని మండలాలు, గ్రా మాల ప్రజలు తప్పక నిబంధనలు పాటించాలన్నారు. ఇళ్లకే పరిమితం కావాలని, కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రతిఒక్కరూ చొరవ చూపాలన్నారు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, సినిమాహాల్స్ రాత్రి ఎనిమిదిగంటల వరకు మూసి వేయాలని, లేకుంటే సెక్షన్ ఐసీపీ 188, సెక్షన్ 51, 60 డీఎం యాక్ట్ 2005 ప్రకారం కేసులు నమోదు చేసి శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంగళవారం వర్ధన్నపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో హైపోక్లోరైట్ ద్రావణ పిచికారీ కార్యక్రమంలో ఏసీపీ రమేశ్ పాల్గొన్నారు. అనంతరం కర్ఫ్యూ నిబంధనలను వివరించారు. ఈ నెల 30వ తేదీ వరకు రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. కేవలం అత్యవసర సేవలు, నిత్యావసర సరుకుల రవాణా, మెడిసిన్, నీటి సరఫరాకు సంబంధించిన పనులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. అతిక్రమించినా, మాస్కులు ధరించకపోయినా చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కమిషనర్ రవీందర్, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు.
కరోనా కట్టడిలో భాగస్వాములవ్వాలి
చెన్నారావుపేట: కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఎస్సై శీలం రవి ప్రకటనలో కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుందని, వ్యాపార సముదాయాలను మూసి వేయాలన్నారు.
గుంపులుగా ఉంటే కఠిన చర్యలు
శాయంపేట: బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుంపులుగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పోరిక హరికృష్ణ, ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. వివాహాలకు 50మంది, అంత్యక్రియలకు 20మంది మాత్రమే ఉండాలన్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ భద్రునాయక్, ఆర్ఐ హేమానాయక్ పాల్గొన్నారు.
అధికారులకు సహకరించాలి
పర్వతగిరి : కర్ఫ్యూ నిబంధనలు తప్పక పాటిస్తూ ప్రజలందరూ అధికారులకు సహకరించాలని పర్వతగిరి తహసీల్దార్ మహబూబ్ అలీ, సీఐ కిషన్ ఒక ప్రకటనలో కోరా రు. గ్రామాల్లో ఉత్సవాలు, బొడ్రాయి, దుర్గమ్మ పండుగలు నిలిపివేయాలని, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు తెలిసేలా దండోరా వేయించాలని సూచించారు.
దుగ్గొండి: కరోనా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుగ్గొండి ఎస్సై రవికిరణ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు. అవసరం మేరకు బయటకు రావాలన్నారు. అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఠాంఠాం వేయించాలన్నారు.
సంగెం: నైట్ కర్ఫ్యూ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై ఎం సురేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మండల పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు.
ఖానాపురం : మండలంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని తహసీల్దార్ జూలూరి సుభాషిణి అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో ప్రతిరోజూ శానిటేషన్ చేసేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు.
నల్లబెల్లి: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఎస్సై బండారు వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆత్మకూరు: రోజురోజుకూ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ మండలంలోని ప్రతి గ్రామంలో అమలులో ఉంటుందని సీఐ రంజిత్కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సై రాజబాబు, పోలీస్సిబ్బంది పాల్గొన్నారు.
దామెర: ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ రియాజొద్దీన్, ఎస్సై భాస్కర్రెడ్డి కోరారు. మంగళవారం వారు స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
గీసుగొండ : రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలు తప్పక పాటించాలని, లేకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సీఐ రాయల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సై అబ్దుల్ర హీం, రాజు పాల్గొన్నారు.
రాయపర్తి: కరోనా వైరస్ నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ కోరారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఎస్సై పింగిళి నాగరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ తహసీల్దార్ పెద్దూరి శ్రీకాంత్, గిర్ధావర్ మల్లయ్య, వీఆర్వోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నెక్కొండ: కరోనా కట్టడికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూకు అందరూ సహకరించాలని ఎస్సై నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొనారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చెన్నారావుపేట: మండలంలోని ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు తప్పక పాటించాలని తహసీల్దార్ పూల్సింగ్చౌహన్ అన్నారు. మంగళవారం ఆయన తహసీల్ కా ర్యాలయంలో ఎస్సై రవి, ఎంపీడీవో లలిత, వైద్యాధికారి రాజుతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.