న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ)లను కేంద్రం ప్రైవేటీకస్తుందని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్లతో సెంటిమెంట్ బలపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఇండెక్స్ నిఫ్టీలో సోమవారం ట్రేడింగ్లో బ్యాంక్ ఇండెక్స్ పుంజుకున్నది. ఈ రెండు బ్యాంకుల షేర్లు 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకాయి.
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ రెండు బ్యాంకుల్లో కేంద్రం 51 శాతం వాటాలను ఉపసంహరించనున్నదని వార్తలొచ్చాయి. దీంతో ముంబై కేంద్రంగా పని చేస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ రెండు రెట్లు పెరిగి రూ.24.30 వద్ద ట్రేడయింది.
80.5 మిలియన్ల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో మరో 2.9 మిలియన్ల షేర్ల బదిలీ పెండింగ్లో ఉంది.
ఇక చెన్నై కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) షేర్ ఎన్ఎస్ఈలో 52 వారాల గరిష్ఠాన్ని తాకి రూ.23.60 వద్దకు చేరుకున్నది. రెట్టింపుకు పైగా షేర్లు ట్రేడయ్యాయి.
ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో 71 మిలియన్ల షేర్లు చేతులు మారాయి. మరో 3.6 మిలియన్ల షేర్ల బదిలీ పెండింగ్లో ఉంది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సుమారు నాలుగు శాతం లబ్ధి పొంది 2472.75 వరకు దూసుకెళ్లింది.