ఒక్కోసారి మనం ఏదో చేయాలనుకుంటాం.. మరేదో చేస్తుంటాం. అందుకు తగిన ప్రతిఫలాన్ని కూడా పొందుతుంటాం. అయితే, ప్రతిఫలం మంచిదైతే ఫర్వాలేదు కాని చెడుదైతేనే ఇబ్బందులన్నీ. ఇలాంటి అనుభవమే చైనాలోని ఓ బిలియనీర్కు కలిగింది.
చైనాకు చెందిన మిటువాన్ సంస్థ సీఈఓ వాంగ్జింగ్ బిలియనీర్. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ పోస్టింగ్లు పెడుతుంటాడు. ఇటీవల ఆయనకు 1100 ఏండ్ల క్రితం నాటి పద్యం ఒకటి దొరికింది. ఎంతో పురాతనమైంది కదా..! సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తన పేరు మార్మోగిపోతుందని భావించాడు. ఇంకే అనుకున్నదే తడవుగా దాన్ని మరింత డిజైన్లు దిద్ది మరీ పోస్ట్ చేశాడు.
అయితే, అలా సోషల్ మీడియాలో ఆ పురాతన పద్యాన్ని పోస్ట్ చేశాడో లేదో ఆయన సంపద మెల్లమెల్లగా ఆవిరై పోవడం ప్రారంభించింది. ఈ విషయాన్ని వాంగ్జింగ్ గుర్తించేలోపే దాదాపు రూ.18,370 కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) నష్టపోయడంట.
అయితే వాంగ్జింగ్ పోస్ట్ చేసిన 1100 ఏండ్ల నాటి పద్యం చైనా మొదటి చక్రవర్తి అణచివేత విధానాలపై వ్రాయబడింది. ఈ పద్యాన్ని పోస్ట్ చేసినప్పుడు అతను చైనా ప్రస్తుత జీ జిన్పింగ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ప్రజలు భావించారు. ఆయన సంస్థల నుంచి షేర్లను నష్టాలకు విపరీతంగా అమ్మేసుకున్నారు. దాంతో అయ్యాగారికి వేల కోట్లలో నష్టమొచ్చిపడింది. పప్పులో కాలేసానని తెలుసుకున్న వాంగ్జింగ్ తర్వాత ఆ పోస్ట్ను తొలగించాడు. తన ఉద్దేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్శించాలని ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని వాంగ్జింగ్ ఇప్పుడు తనను కలిసిన వారికల్లా ఉపదేశం చేస్తున్నాడంట..!
అమెరికా-రష్యా నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు రాజస్థాన్ నిర్ణయం
టీకా తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ బాస్
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
జైపూర్లో వరుస పేలుళ్లు.. 71 మంది దుర్మరణం : చరిత్రలో ఈరోజు
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
విడిపోతే కష్టాలు ఎదుర్కొంటాం : అజీమ్ ప్రేమ్జీ
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..