న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నెటిజన్లతో పాటు బీజేపీకి క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే.. లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించినట్లు నిన్న రాత్రి 11:16 గంటలకు శశిథరూర్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, ఇండోర్లోని బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దీంతో వాస్తవాన్ని గ్రహించిన శశిథరూర్ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఆ ట్వీట్ను తొలగించారు శశిథరూర్.
బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్(78) మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 1989-2019 వరకు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు. 2014-19 వరకు లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహాజన్ సేవలందించారు.