హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి, విగ్రహావిష్కరణ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఇవాళ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతులు ఉండవని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పంజాగుట్ట, రాజ్భవన్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదాన్, నిరంకారీ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
మినిస్టర్ రోడ్డు నుంచి సంజీవయ్య పార్క్ వైపు వాహనాలను అనుమతించరు. బుద్ధభవన్ వద్ద దారి మళ్లిస్తారు.
ట్యాంక్బండ్ నుంచి సంజీవయ్య పార్కుకు వచ్చే వాహనాలు కర్బాలా మైదాన్ వైపు వెళ్లాలి.
మింట్ కంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను సైఫాబాద్ ట్రాఫిక్ పీఎస్ వద్ద మళ్లిస్తారు.
తెలుగుతల్లి బ్రిడ్జి మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ దగ్గర మళ్లిస్తారు.
పీవీ జ్ఞానభూమికి ఎలా రావాలంటే..
సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు రసూల్పురా జంక్షన్ నుంచి మినిస్టర్ రోడ్డు -కిమ్స్ దవాఖాన-నల్లగుట్ట బ్రిడ్జి, సంజీవయ్య పార్క్ మీదుగా పీవీ జ్ఞాన భూమికి చేరుకోవాలి.
అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు అప్పర్ ట్యాంక్ బండ్-సెయిలింగ్ క్లబ్-బుద్ధ భవన్-సంజీవయ్య పార్క్-పీవీ జ్ఞాన భూమి వద్దకు చేరుకోవాలి.
వాహనాల పార్కింగ్ను ఎంఎంటీఎస్ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు.
విగ్రహావిష్కరణకు వచ్చే ఆహ్వానితులు ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా నెక్లెస్ రోటరీకి చేరుకోవాలి.
ఆహ్వానితులు తమ వాహనాలను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న డాక్టర్స్ కార్స్ స్థలంలో పార్క్ చేసుకోవాలి.