న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ (కొవిషీల్డ్) సింగిల్ డోస్తో యాంటీ బాడీలు కనీసం ఏడాది వరకూ ఉంటాయని బ్రిటన్లో చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. 11 నెలల విరామంతో ఈ వ్యాక్సిన్ మెరుగైన ఇమ్యూనిటీని ఇస్తుందని థర్డ్ డోస్తో యాంటీ బాడీలు మరింత పెరుగుతాయని ఈ అథ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తొలి, రెండవ డోసుల మధ్య 45 వారాలు లేదా 11 నెలల విరామంతో యాంటీ బాడీ రెస్పాన్స్ 18 రెట్లు అధికంగా ఉన్నట్టు అధ్యయన రచయితలు వెల్లడించారు.
సెకండ్ డోస్ పూర్తయిన 28 రోజుల తర్వాత యాంటీ బాడీలను పరిశీలించారు. 18 నుంచి 55 ఏండ్ల మధ్యవయసు కలిగిన వాలంటీర్లకు ఆస్ట్రాజెనెకా మొదటి, రెండు డోసులు ఇచ్చిన అనంతరం యాంటీబాడీల ఎదుగుదలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు మదింపు చేశారని లాన్సెట్ ప్రీప్రింట్ సర్వర్లో సంబంధిత వివరాలను పోస్ట్ చేశారు. బూస్టర్ డోస్గా థర్డ్ డోస్ తీసుకున్న వారిలో యాంటీ బాడీలు మరింత వృద్ధి చెందినట్టు గుర్తించారు. కాగా భారత్లో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 12 వారాలుగా నిర్ధారింంచారు.