పారిస్ : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇమ్యూనిటీ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని పలు అథ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒరేగావ్లో డయాలసిస్పై ఆధారపడిన నర్సు ఎస్తర్ జోన్స్ ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా యాంటీబాడీలు అభివృద్ధి కాలేదు. మూడవ సారి ఆమె మొడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీల స్పందన మెరుగ్గా ఉన్నట్టు వెల్లడైంది. ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే తక్కువగా ఉన్నా యాంటీబాడీ రెస్పాన్స్ మెరుగ్గానే ఉన్నట్టు రక్తపరీక్షలో తేలింది. యాంటీబాడీలు మరింత పెరుగుతాయనే ఆశతో ఆమె గత నెలలో నాలుగో డోస్ కూడా తీసుకున్నారు. 2010లో కిడ్నీ మార్పిడి చేయించుకున్న జోన్స్ అవయవం కుచించుకుపోకుండా కాపాడుకునేందుకు ఆమె అప్పటినుంచి ఇమ్యూనిటీని అణిచివేసే మందులు వాడుతున్నారు.
ఇక ఇలాంటి పరిస్ధితులతో బాధపడే వారికోసం ఫ్రాన్స్లో ఆరోగ్య సిబ్బంది వారికి వ్యాక్సిన్ మూడో డోస్ అందిస్తున్నారు. వీరిలో సెకండ్ డోస్తో 40 శాతం పెరిగిన యాంటీబాడీలు మూడవ డోస్ తీసుకున్న నాలుగు వారాల తర్వాత ఏకంగా 68 శాతం మేర పెరిగినట్టు గుర్తించారు. వ్యాక్సినేషన్ తర్వాత ఇన్ఫెక్షన్కు గురవడం ఇమ్యూన్ ఇబ్బందులతో బాధపడే వారిని మరింత భయకంపితులనుచేస్తుందని జాన్ హోప్కిన్స్ వర్సిటీలో అవయవ మార్పిడి సర్జన్, అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ డారీ సెగెవ్ చెప్పుకొచ్చారు.
వారికి మెరుగైన రోగ నిరోధక ప్రక్రియను తాము కనుగొనే వరకూ వారు వ్యాక్సినేషన్కు దూరంగా ఉండటమే మంచిదని చెప్పారు. 5 శాతం జనాభా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారని కొన్ని రకాల క్యాన్సర్లు, అవయవ మార్పిడి, తీవ్ర కాలేయ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, డయాలసిస్, స్టెరాయిడ్స్ కొన్ని రకాల మందులు వాడేవారిలో ఇమ్యూనిటీ ఇబ్బందులు నెలకొంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వీరి సమస్యలను అవగాహనలోకి తీసుకుని తగిన వ్యూహాలు రూపొందించాలని కోరుతున్నారు.