న్యూఢిల్లీ: పదిరోజుల హోం క్వారంటైన్ తర్వాత కరోనా టెస్టు చేయాల్సిన అవసరం లేదని ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఇంటిదగ్గర స్వల్ప లక్షణాలతో లేక లక్షణాలు లేకుండా చికిత్స పొందినవారిలో 6-7 రోజుల తర్వాత వైరస్ నిర్వీర్యం అవుతుందని ఆయన అన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదు. కాకపోతే పరీక్షలు జరిపితే చనిపోయిన వైరస్ అవశేష కణాల వల్ల తప్పుడు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ గులేరియా చెప్పారు. స్వల్ప లక్షణాలున్న కేసుల్లో వైరస్ 6-7 రోజుల్లో చనిపోతుందని శాస్త్రీయంగా రుజువైందని ఆయన నొక్కిచెప్పారు. హోం క్వారంటైన్ చికిత్సపై కేంద్ర ప్రభుత్వం కూడా నూతన మార్గదర్శకాలు జారీచేసింది. కోవిడ్ రోగులు పదిరోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉండాలని, తర్వాత వరుసగా మూడురోజుల పాటి జ్వరం లేకపోతే క్వారంటైన్ నుంచి బయటకు రావచ్చని వివరించింది.