న్యూఢిల్లీ, మే 21: కరోనా యాంటిబాడీలు శరీరంలో తయారయ్యాయో, లేదో తెలియజేసే పరికరాన్ని డీఆర్డీవో అందుబాటులోకి తెచ్చింది. ‘డిప్ కొవాన్’గా పిలిచే ఈ పరికరాన్ని డీఆర్డీవోలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డిపాస్), ఢిల్లీలోని వ్యాన్గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లు కలిసి అభివృద్ధి చేశాయి. ఈ కిట్కు ఏప్రిల్లో ఐసీఎంఆర్, మేలో కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతులు లభించినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీలో వెయ్యి మంది కొవిడ్ రోగులను ఈ కిట్తో పరిశోధించినట్టు పేర్కొన్నారు.
ఏమిటీ ‘డిప్కొవాన్’?
ఒక వ్యక్తి గతంలో కరోనా బారిన పడ్డాడా? లేదా? ఆ వ్యక్తిలో యాంటిబాడీలు వృద్ధి చెందాయా? అవి ఏ స్థాయిలో ఉన్నాయి? తదితర విషయాలను ఈ కిట్ తెలియజేస్తుంది.
ఎలా పనిచేస్తుంది?
కరోనాలోని స్పైక్ ప్రొటీన్, న్యూక్లియోక్యాప్సైడ్ (ఎస్ అండ్ ఎన్) ప్రొటీన్లను విశ్లేషించి ఈ కిట్ శరీరంలోని యాంటిబాడీలను అంచనా వేస్తుంది. 99 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది.
ఎందుకు ఉపయోగం?
కొవిడ్-19 నుంచి రక్షించే ప్రతిరక్షకాలు శరీరంలో ఏర్పడ్డాయో లేదో తెలుసుకోవడమే ఈ కిట్ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం నిర్వహించే సెరో-సర్వేల నిర్వహణకూ ఇది సాయపడుతుంది.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
బహిరంగ మార్కెట్లో జూన్ మొదటి వారంలో ఈ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కిట్ షెల్ఫ్ లైఫ్ (మన్నిక కాలం) 18 నెలలు.
ధర ఎంత?
డీఆర్డీవో వివరాల ప్రకారం మార్కెట్లోకి విడుదలయ్యే ఒక్కో కిట్ సాయంతో 100 పరీక్షలను నిర్వహించవచ్చు. ఒక్కో పరీక్షకు రూ.75 చొప్పున ఖర్చు అవుతుందని పరిశోధకులు తెలిపారు. ఒక్కో టెస్టు నిర్వహణకు 75 నిమిషాల సమయం పడుతుందన్నారు.