తిరువనంతపురం : కొవిడ్-19 కేసుల పెరుగుదలతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, సండే లాక్డౌన్ కొనసాగించనున్నట్టు కేరళ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన కొవిడ్-19 సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో కేరళలో 29,682 తాజా కేసులు వెలుగుచూడగా 25,910 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
మహమ్మారి బారినపడి ఒక్కరోజులో 142 మంది మరణించారు. కేరళలో కరోనా పాజిటివిటీ రేటు 17.54 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు. కరోనా క్వారంటైన్, ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.