అడ్డగూడూరు, ఏప్రిల్ 26 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రా ధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని కంచనపల్లి గ్రామంలో రూ.2 కోట్ల 70లక్షలతో నిర్మించిన కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ను సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రతి పేద విద్యార్థి పైసా ఖర్చు లేకుండా చదువుకునేందుకు కేజీబీవీ, గురుకుల పాఠశాలలు ఎంతగానో దోహదపడతాయన్నారు. త్వరలోనే కేజీబీవీ పాఠశాల జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ అవుతుందన్నా రు. పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని చౌళ్లరామారానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు నరేశ్, కృష్ణమూర్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా ఎమ్మెల్యే ఇరువురు కుటుంబాలకు రూ.2లక్షల ప్రమాదబీమాను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు జోసఫ్, వైస్ ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ కుకునూరి జ్యోతి, ఈఈ అనిత, ఎంఈవో శ్రీధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన వారందరికీ నెలకు రూ.2 వేల నగదు, 25 కేజీల బియ్యాన్ని ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. కంచనపల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యావలంటీర్లు, పార్ట్ టైం టీచర్లను కూడ ప్రభుత్వం ఆదుకోవాలని, రాష్ట్రంలోని కేజీబీవీ పాఠశాలల్లో కేర్ టేకర్ను నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ ఆడిట్ కమిటీ జిల్లా కన్వీనర్ నర్సింహ్మమూర్తి, సోమేశ్వర్, శ్రీనివాస్, ఉప్పలయ్య, చంద్రశేఖర్రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.