పండ్లు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను కలిగి ఉన్నా వాటిలో ఉండే చక్కెర మధుమేహుల్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను అపసవ్యం చేయడంతో అది స్ధూలకాయం, అధిక కొవ్వు, రక్తపోటు వంటి అనర్ధాలకు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో టైప్ టూ మధుమేహులకు పోషకాహార నిపుణులు, డైటీషియన్లు పండ్లను అరుదుగా సిఫార్సు చేస్తుంటారు.
అయితే మధుమేహులకు సురక్షితమైన తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండ్ల రసాలు ఇవ్వడం మేలని పోషకాహార నిపుణులు మామి అగర్వాల్ సూచించారు. చక్కెర తక్కువగా ఉన్న పండ్లు రక్తంలో చక్కెరను మెరుగ్గా నియంత్రిస్తాయని ఈ తరహా పండ్ల రసాలు మేలని చెబుతున్నారు టైప్ టూ మధుమేహులు యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష, పపాయ, పీచ్, పియర్, కివీ, ప్లమ్ వంటి పండ్ల రసాలు తీసుకోవచ్చని సూచించారు.