ముంబై : మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జిల్లా కలెక్టర్లతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సమీక్ష నిర్వహించనున్నారు.
సీఎం అధ్యక్షత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో కరోనా కరోనా వ్యాప్తికి గల కారణాలు, వైరస్ ఉధృతిని కట్టడి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.
గురువారం ఒక్కరోజే మహారాష్ట్రలో కొత్తగా 5,504 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకాగా..14 మంది ప్రాణాలు కోల్పోయారు.