జయశంకర్ భూపాలపల్లి : అచేతన స్థితిలో ఉన్న వ్యక్తి ఇంటివద్దనే భూమి రిజిస్ట్రేషన్ చేసి రెవెన్యూ అధికారులు తమ సహృదయతను చాటుకున్నారు. జిల్లాలోని కాటారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన గుడిపాటి అనంతరెడ్డి గతంలో కరెంట్ షాక్తో శరీరం కింది భాగం చచ్చుబడి లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు.
సదరు వ్యక్తికి అతని తండ్రి నుంచి రేగులగూడెం శివారు 116, 134 సర్వే నెంబర్లోని భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో తహసీల్దార్ సునీత కంప్యూటర్ ఆపరేటర్, సిస్టంతో రేగులగూడెంలోని అతడి ఇంటికే వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మానవత్వంతో తమ ఇంటి దాకా వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేసి సహాయం చేసిన తహసీల్దార్కు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఐసోలేషన్ సెంటర్ను సందర్శించిన ఎంపీ కవిత