కుమ్రం భీం ఆసిఫాబాద్ : పెద్దపులి దాడిలో ఓ ఎద్దు మృతి చెందగా మరో ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని పెంచికల్పేట్ మండలం అగర్గూడ అటవీసమీపంలో పులి దాడిలో రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన బట్టె తోగయ్య రెండు ఎద్దులు ఆదివారం తెల్లవారు జామున స్థానిక అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లాయి.
మధ్యాహ్నం ఓ ఎద్దు తీవ్ర గాయాలతో ఇంటికి రాగా, మరో ఎద్దు రాకపోయే సరికి అటవీ ప్రాంతంలో గాలించారు. ఓ చోట నిర్జీవంగా ఎద్దు కనిపించింది. ఈ విషయమై అటవీ అధికారులను వివరణ కోరగా.. పులిదాడి చేసిన విషయం నిజమేనని, రైతుకు నష్టపరిహారం అందేటట్లు కృషిచేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
శంషాబాద్లో కారు,లారీ ఢీ..ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు
ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత