రాజ్ కోట్ : ఫైనాన్షియర్ల నుంచి బంధువులు తీసుకున్న రుణంపై ఒత్తిళ్లు ఎదురవడంతో కుంగిపోయిన ఐస్ క్రీమ్ పార్లర్ యజమాని బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుజరాత్ లోని మోర్బి జిల్లాలో వెలుగుచూసింది. బంధువులు ఫైనాన్షియర్ల నుంచి రుణం తీసుకునే సమయంలో ష్యూరిటీ పత్రాలపై బాధితుడు సంజయ్ కరియా సంతకాలు చేశారు. డబ్బు తిరిగి చెల్లించాలని ఫైనాన్షియర్లు సంజయ్ ను వేధింపులకు గురిచేశారు. ఒత్తిడికి లోనైన సంజయ్ విషం సేవించి విగతజీవిగా మారాడు.
సంజయ్ కు హోల్ సేల్ టీ వ్యాపారం కూడా ఉందని బలవన్మరణానికి ముందు తమకు ఫోన్ చేసి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడని స్నేహితులు వెల్లడించారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లను తట్టుకోలేకే సంజయ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.