న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 10న భేటీకానుంది. ఈ సందర్భంగా దేశంలో కొనసాగుతున్న కరోనా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నది. శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ‘కరోనాపై జరుగుతున్న పోరు రాజకీయ విభేదాలకు అతీతమైంది. జాతి యావత్తూ కలిసికట్టుగా ఈ పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను గాలి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎంపీలంతా ప్రజలకు సేవ చేసేందుకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.
అదే సమయంలో మహమ్మారిని కలిసికట్టుగా, జవాబుదారీతనంతో ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు స్టాండింగ్ కమిటీలు సమావేశం కావాలని సూచించారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో కొత్తగా 4,01,078 కరోనా కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 4,187 మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.