తిరువనంతపురం : కొవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్న కేరళ, మహారాష్ట్రల్లో వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుండటం ఊరట ఇస్తోంది. కేరళలో కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 6676 తాజా పాజిటివ్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 60 మంది మరణించారు. ఇక కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 83,184కి తగ్గాయి.