ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఏ టీమ్ అయినా టాప్ రేటెడ్ ఇండియన్ ప్లేయర్స్ను తుది జట్టు నుంచి తప్పించవు. గాయం కారణంగానో, పూర్తి ఫిట్గా లేకపోతేనో తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన పెడతారు. కానీ ఈ సీజన్లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ పెద్ద సాహసమే చేసింది. దానికి తగిన మూల్యం కూడా చెల్లించింది.
ఫ్రాంచైజీ ఐపీఎల్లోకి వచ్చినప్పటి నుంచీ నిలకడగా రాణిస్తున్న మనీష్ పాండేను ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు పక్కన పెట్టారు. అతని స్థానంలో అనామకుడైనా విరాట్ సింగ్ను తీసుకున్నారు. ఆ నిర్ణయం దారుణంగా బెడిసికొట్టింది. ఆదివారం మ్యాచ్లో 14 బంతులాడి 4 పరుగులు మాత్రమే చేశాడు విరాట్ సింగ్. అలాగని పాండే మొత్తానికి ఫామ్లో లేడా అంటే అదీ కాదు.
ఈ సీజన్లో మూడు మ్యాచ్లలో 101 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 61. మొత్తంగా ఐపీఎల్లో 149 మ్యాచ్లాడి 3369 పరుగులు చేసిన అనుభవం అతని సొంతం. అలాంటి ప్లేయర్ను పక్కన పెట్టి తప్పు చేశామన్నట్లుగా మ్యాచ్ తర్వాత కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడాడు. అది సెలక్టర్లపై ఆధారపడి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ అది వాళ్లు తీసుకున్న నిర్ణయం. విరాట్ను తీసిపారేయలేం. అతడు కూడా మంచి ప్లేయరే. కానీ పిచ్ చాలా కష్టంగా ఉంది అని వార్నర్ అన్నాడు.