నీలగిరి/ దేవరకొండ, మే 7 : నల్లగొండ పట్టణంలోని అన్ని గృహాల్లో ఉంటున్న ప్రజల ఆరోగ్య వివరాలను సక్రమంగా నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జ్వర సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సర్వే బృందం సభ్యులతో మాట్లాడుతూ ప్రజలకు సర్వే గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది నయీం, అనిల్, అంగన్వాడీ టీచర్లు, వైద్యారోగ్య సిబ్బంది ఉన్నారు.
దేవరకొండ : పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వేను నిర్వహించిస్తున్నట్లు కమిషనర్ వెంకటయ్య తెలిపారు. కరోన లక్షణాలు ఉన్నవారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.