రోగ నిరోధక శక్తి, పోషక విలువలతో కూడిన ఆహారం.. ఈ రెండూ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా కొవిడ్-19 వైరస్ బారిన పడుతున్నారు చాలామంది. సెకండ్ వేవ్లో అధిక శాతం పాజిటివ్ పేషెంట్లు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నా హాస్పిటల్స్లో చేరుతున్నవారి సంఖ్యకూడా అధికంగానే ఉంది. చాలామంది రెండువారాల్లో కోలుకుంటున్నారు. అయినా నీరసం, అలసటతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నీళ్లు: శరీరానికి కావాల్సిన అతిముఖ్యమైన ద్రవం నీరు. చాలామంది రోజువారీ పనుల్లో పడి నీళ్లు తాగాలన్న విషయాన్నే మర్చిపోతారు. కానీ, నీళ్లు చాలినంతగా తాగకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. జీర్ణక్రియలో, శోషణలో, పోషక విలువలను ఉపయోగించుకోవడంలో శరీరానికి నీరే ఆధారం.
తాజాపండ్లు: ఉదయం పండ్లముక్కలు లేదా పండ్లరసాలు తీసుకుంటే నీరసం తగ్గుతుంది. అలాగే, తాజా కూరగాయలను మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. వీటిలో ఉండే ప్రొటీన్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, త్వరగా కోలుకునేలా చేస్తాయి. అవసరమైతే డాక్టర్ని సంప్రదించి
రోగ నిరోధక శక్తిని పెంచే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే వ్యాయామం చేయాలి.
మయూరి ఆవుల,
న్యూట్రిషనిస్ట్,
www.trudiet.in