న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల మంది మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీలోని ఆటోవాలాలు, ట్యాక్సీ వాలాలకు రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు.
అదేవిధంగా, ఢిల్లీలోని రేషన్కార్డుదారులు అందరికీ రెండు నెలలపాటు ఉచిత రేషన్ అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనివల్ల మొత్తం 72 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అయితే రెండు నెలలపాటు ఉచిత రేషన్ అందిస్తున్నంత మాత్రాన రెండు నెలలపాటు లాక్డౌన్ కొనసాగుతుందని భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. నిరుపేదల సహాయార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ముగిసిన ఎన్నికలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కూలిన మెట్రో రైలు వంతెన.. 13 మంది దుర్మరణం
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రకటించిన స్టాలిన్
తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం.. కరోనాతో ప్రధాన అర్చకులు మృతి