తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
నెక్కొండ, మే 12 : ఆపత్కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. అకాల వర్షంతో నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకోవాలని, రంగు మారినా ఇబ్బంది లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ను ఫోన్లో ఆదేశించారు. లాక్డౌన్తో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రైతులకు బిల్లుల చెల్లింపులు, ధాన్యం తరలింపులో లారీల కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట సొసైటీ చైర్మన్ మారం రాము, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, రైతుబంధు సమితి జిల్లా బాధ్యుడు చల్లా చెన్నకేశవరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ దొనికెన సారంగపాణి ఉన్నారు. అలాగే మండలంలోని చంద్రుగొండ గ్రామానికి చెం దిన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగ ని సూరయ్య తల్లి మృతిచెందగా అతడి కుటుంబాన్ని పరామర్శించారు.